తల్లికి వందనం పథకం పేద విద్యార్థుల పాలిట వరమని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం అమలు చేశామని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన రోజునే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేశామన్నారు. భావి తరాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ సర్వ నాశనమైందని ప్రశాంతిరెడ్డి ధ్వజమెత్తారు. మీకు 15000, మీకు 15000 అని ఎగతాళి చేసినవారు ఇప్పుడేమంటారని ప్రశ్నించారు.
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️