Hyderabad Rains 2024 : రెండు రోజుల పాటు తెరిపిలేని వానలు భాగ్యనగరాన్ని ముంచెత్తాయి. కాలనీలు జలమయమై, రోడ్లపై వరద పొంగుతుండగా, హుస్సేన్సాగర్ పరీవాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అనేక చోట్ల భారీ వృక్షాలు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. హైదరాబాద్ విపత్తు నిర్వహణ సంస్థ - హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సహాయక చర్యలు చేపట్టారు. ఘట్కేసర్లో విద్యుత్ షాక్తో ఒకరు, షాద్నగర్లో చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ అనుదీప్, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.
Be the first to comment