ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్స్వీప్
- 2 years ago
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) విజయదుంధుభి మోగించింది. మంగళవారం ఆరు స్థానాలకు వెలువడిన ఫలితాల్లో అన్నింట్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నెల 10వ తేదీన ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో కరీంనగర్లో ఎల్.రమణ, భానుప్రసాద రావు విజయం సాధించగా... ఖమ్మంలో తాతా మధు, నల్గొండలో ఎంసీ కోటిరెడ్డి మెదకలో ఓటేరు యాదవరెడ్డి, ఆదిలాబాద్లో దండే విఠల్ విజయం సాధించారు.