Jagan Govt Repeals 3-Capital Bill: Meanwhile North Andhra conduct huge rally in support of Vizag as Executive capital city. #3CapitalBilRepeal #AP3Capitals #VizagExecutivecapital #North Andhra #amaravathifarmers #APCMJagan #TDP #APassembly
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లులను జగన్ సర్కార్ ఉపసంహరించుకోవడంతో ఉత్తరాంధ్రలో ప్రజా ఉద్యమం పురుడు పోసుకునేలా కనిపిస్తోంది. సాగరనగరం విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించాలంటూ ఈ ప్రాంత ప్రజలు ప్రదర్శనలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు. పరిపాలన రాజధానిగా బదలాయించడానికి విశాఖపట్నానికి అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ప్రాంత ప్రజల అకాంక్షలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తోన్నారు.
Be the first to comment