అర్థరాత్రి దుస్తులు విప్పేసి నడిరోడ్డుపై సెల్ఫీలు
- 4 years ago
సాక్షి, హైదరాబాద్ : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పోలీసులు ఎంత కట్టడి చేసినా పోకిరీల అరాచకాలు ఆగడం లేదు. బ్రిడ్జీపై ఆగి సెల్ఫీలు దిగితే కేసులు పెడతామని హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. పోలీసుసు హెచ్చరికలను భేఖాతరు చేస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. దుర్గం చెరువు బ్రిడ్జిపై అర్థరాత్రి దుస్తులు విప్పేసీ సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. లైవ్లో పోకిరీల ఆగడాలను చూసిన పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీసు స్టేషన్కి తరలించారు.