AP Lock down : Free Ration Started At Ration Shops | Rs 1000 To Poor on April 4th
  • 4 years ago
In view of the lockdown, all BPL households will get ration along with a kg of dal thrice on March 29th, April 15th and April 29th. Financial assistance of Rs 1000 will also be provided to these families on 4th of April. YSRCP MLA RK Roja supervising the social distancing at Ration shops.
#aplockdown
#freeration
#RationShops
#mlaroja
#apcmjagan
#1000cashpoor

రాష్ట్రవ్యాప్తంగా కోటి 40 లక్షల మేర రేషన్ కార్డులకు దశలవారీగా రేషన్ అందనుంది. తెల్లరంగు రేషన్ కార్డు కలిగిన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెల రోజుల వ్యవధిలో మూడు దశల్లో నిత్యావసర సరుకులను అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆదివారం నాటితోో పాటు వచ్చే నెల 15, 29వ తేదీల్లో కూడా చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్‌ను అందజేయనుంది ప్రభుత్వం.వచ్చే 29వ తేదీ నాటికి ఉచితంగా అయిదు కేజీల బియ్యం, ఒక కేజీ పప్పు చొప్పున మొత్తం 15 కేజీల బియ్యం, మూడు కేజీలు కంది పప్పుతో పాటు కరోనా ప్యాకేజీలో భాగంగా వచ్చే నెల 4వ తేదీన గ్రామ వలంటీర్ల ద్వారా 1000 రూపాయల మొత్తాన్ని అందజేయనుంది. కరోనా వల్ల లాక్‌డౌన్ పరిస్థితులు తలెత్తడం, దినసరి వేతన కార్మికులు, రోజువారీ కూలీలకు ఆర్థిక భరోసాను కల్పించడంలో భాగంగా ప్రభుత్వం మొత్తాన్ని చెల్లించనుంది.
Recommended