Skip to playerSkip to main contentSkip to footer
  • 9/18/2019
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి కాస్సేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆయన భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడానికి వచ్చిన రెవెన్యూ అధికారులు, పోలీసులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కోడెలను ప్రభుత్వమే హత్య చేసిందంటూ ఆరోపిస్తోన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడానికి వీల్లేదంటూ పట్టుబట్టారు. రెవెన్యూ అధికారులు వారిని నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ.. వినిపించుకోొలేదు.
#FormerspeakerKodelaSivaPrasad
#BasavatarakamHospital
#Chandrababu
#tdp
#demise
#assembly

Category

🗞
News

Recommended