Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
BJP MP GVL Narasimha Rao sensational comments on AP Capital. He says AP Govt may shift capital to Prakasam dist.Now GVL comments created political heat in Capital controversy.
#apcapital
#bjp
#prakasam
#GVLNarasimhaRao
#ysrcp
#jagan
#bothsasathyanarayana
#amaravathi

ఏపీ రాజధాని అమరావతిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రాజధానిని కొనసాగించే యోచన వైసీపీకి లేదనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. తనకున్న సమాచారం మేరకు ప్రకాశం జిల్లాకు రాజధాని తరలిస్తున్నారంటూ మరో బాంబు పేల్చారు. ఇప్పటికే అమరావతి రాజధానిగా కొనసాగింపు పైన మంత్రి బొత్సా వ్యాఖ్యలతో రాజకీయంగా రగడ కొనసాగుతోంది. ఇదే సమయంలో బీజేపీ నేతలు రాజధానిలో పర్యటించి మద్దతు ప్రకటించారు. రాజధాని తరలించవద్దని డిమాండ్ చేసారు. ఇప్పుడు ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్న ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలతో మరో సారి కలకలం రేగింది. దీనికి ఆయన వివరణ సైతం ఇచ్చారు. ఇప్పుడు దీని పైన ఏపీ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.

Category

🗞
News

Recommended