India vs Australia,3rd ODI : Virat Kohli Registers 41st ODI Ton During 3rd ODI Versus Australia
  • 5 years ago
Indian skipper Virat Kohli came out to bat early, following the dismissals of the openers, but kept the scoreboard ticking with a focused innings in the ongoing third ODI at JSCA Stadium, Ranchi.
#indiavsaustralia
#australiainindia2019
#3rdodi
#ranchi
#teamindia
#cricket
#viratkohli
#msdhoni
#shami
#bhumra

రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 85 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 41వ సెంచరీ కాగా ఈ సిరిస్‌లో వరుసగా రెండోది కావడం విశేషం. ఆస్ట్రేలియా నిర్దేశించిన 314 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌(1) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ(14) ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు(2)ని కమిన్స్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది.
Recommended