India Vs West Indies 2018, 5th ODI : Teams To Reach Thiruvananthapuram On Tuesday For 5th ODI
  • 5 years ago
Team India landed in Thiruvananthapuram on Tuesday afternoon to a grand welcome, after decimating West Indies in the fourth ODI in Mumbai.
#IndiaVsWestIndies2018
#4thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav


వెస్టిండీస్‌తో నాల్గో వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా ఐదో వన్డేకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో టీమిండియా మంగళవారం కేరళలోని తిరువనంతపురం చేరుకుంది. భారత్‌, వెస్టిండీస్‌ మధ్య ఐదో వన్డేకు గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ మైదానం వేదిక కావడమే ఇందుకు కారణం. ఆఖరిదైన ఐదో వన్డే నవంబర్‌ 1న జరగనుంది. ఈ క్రమంలో ఇరు జట్లు మంగళవారం తిరువనంతపురానికి చేరుకున్న టీమిండియాకు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఇరు జట్ల ఆటగాళ్లకు అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్న ఆటగాళ్లకు కేరళ సంప్రదాయక వాయిద్యాలతో కొంతమంది కళాకారులు చేసిన ప్రదర్శన అందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా పంచుకుంది.
Recommended