తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ నేత పురంధేశ్వరి, ఎంపీ హరిబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటు వేదికగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చట్టంలో లేని హామీలను కూడా కేంద్రం నెరవేరుస్తోందని చెప్పారు.
అవిశ్వాసానికి మద్దతు పలికిన పార్టీలకు ధన్యవాదాలు చెప్పేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లడం హాస్యాస్పదమని పురంధేశ్వరి అన్నారు. ఏపీకి ఏ ఒక్క పార్టీ కూడా మద్దతుగా మాట్లాడలేదని అన్నారు. చంద్రబాబు ఎవరికి ధన్యవాదులు చెబుతారని పురంధేశ్వరి ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా ఏపీ గురించి అర నిమిషం కూడా మాట్లాడలేదని అన్నారు. వారికి చంద్రబాబు ధన్యవాదాలు
పార్లమెంటులో శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ.. బీజేపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని పురంధేశ్వరి మండిపడ్డారు. బీజేపీకి అవినీతి అంటగట్టాలని రాహుల్ గాంధీ తహతహలాడుతున్నారని ధ్వజమెత్తారు.
BJP leaders Purandeswari, Kambhampati Hari Babu on Saturday fired at TDP and Congress for blaming BJP.
Comments