Oneindia Telugu News Update
- 6 years ago
1. ఒకే రోజు 3లక్షల గృహ ప్రవేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు
2. తప్పిన పెను ప్రమాదం: కుప్పకూలిన సీబీఎస్ బస్టాండ్
3. ఇండోనేసియా ఓపెన్లో క్వార్టర్స్కు చేరిన పీవీ సింధు
1. ఒకే రోజు 3లక్షల గృహ ప్రవేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా గురువారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మంది పేదలు ఒకేసారి గృహప్రవేశాలు చేశారు. 'ఆనందాల లోగిళ్లు చూసొద్దాం రండి' పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు పేదల గృహ ప్రవేశాలు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామూహిక గృహప్రవేశాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. వివిధ జిల్లాలో నిర్మించిన గృహ సముదాయాలను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
2. తప్పిన పెను ప్రమాదం: కుప్పకూలిన సీబీఎస్ బస్టాండ్
గౌలిగూడలోని పాత బస్టాండ్(సీబీఎస్) పైకప్పు గురువారం తెల్లవారుజామున కుప్పకూలిపోయింది. అయితే ఆర్టీసీ అధికారుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
బస్టాండ్ షెడ్ కూలిపోయే స్థితిలో ఉన్నట్లు నాలుగు రోజుల క్రితమే అధికారులు గుర్తించారు. దీంతో ముందస్తు చర్యగా అధికారులు బస్సులను లోపలికి అనుమతించలేదు. బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రయాణికులను కూడా అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున భారీ శబ్దంతో షెడ్ కుప్పకూలింది.
3. ఇండోనేసియా ఓపెన్లో క్వార్టర్స్కు చేరిన పీవీ సింధు
జకార్తా వేదికగా జరుగుతున్న ఇండోనేసియా ఓపెన్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గురువారం 23వ పుట్టినరోజు జరుపుకుంటున్న పీవీ సింధు గురువారం జపాన్ షట్లర్ ఆయా ఓహ్రితో జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్లో 21-17, 21-14 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్కు చేరింది.
Read and View all latest news headlines from India and around the world, get today's breaking news and live updates on politics, elections, business, sports, economy...
#news
#Oneindiatelugu
#Update
#Sports
#Movies
2. తప్పిన పెను ప్రమాదం: కుప్పకూలిన సీబీఎస్ బస్టాండ్
3. ఇండోనేసియా ఓపెన్లో క్వార్టర్స్కు చేరిన పీవీ సింధు
1. ఒకే రోజు 3లక్షల గృహ ప్రవేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా గురువారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మంది పేదలు ఒకేసారి గృహప్రవేశాలు చేశారు. 'ఆనందాల లోగిళ్లు చూసొద్దాం రండి' పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు పేదల గృహ ప్రవేశాలు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామూహిక గృహప్రవేశాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. వివిధ జిల్లాలో నిర్మించిన గృహ సముదాయాలను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
2. తప్పిన పెను ప్రమాదం: కుప్పకూలిన సీబీఎస్ బస్టాండ్
గౌలిగూడలోని పాత బస్టాండ్(సీబీఎస్) పైకప్పు గురువారం తెల్లవారుజామున కుప్పకూలిపోయింది. అయితే ఆర్టీసీ అధికారుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
బస్టాండ్ షెడ్ కూలిపోయే స్థితిలో ఉన్నట్లు నాలుగు రోజుల క్రితమే అధికారులు గుర్తించారు. దీంతో ముందస్తు చర్యగా అధికారులు బస్సులను లోపలికి అనుమతించలేదు. బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రయాణికులను కూడా అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున భారీ శబ్దంతో షెడ్ కుప్పకూలింది.
3. ఇండోనేసియా ఓపెన్లో క్వార్టర్స్కు చేరిన పీవీ సింధు
జకార్తా వేదికగా జరుగుతున్న ఇండోనేసియా ఓపెన్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గురువారం 23వ పుట్టినరోజు జరుపుకుంటున్న పీవీ సింధు గురువారం జపాన్ షట్లర్ ఆయా ఓహ్రితో జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్లో 21-17, 21-14 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్కు చేరింది.
Read and View all latest news headlines from India and around the world, get today's breaking news and live updates on politics, elections, business, sports, economy...
#news
#Oneindiatelugu
#Update
#Sports
#Movies