Janasena president Pawan Kalyan wanted to middle class people will come into the politics.
#Janasena
#PawanKalyan
తన మంచి తనాన్ని మరోలా అర్థం చేసుకోవద్దని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న లింగమనేని ఎస్టేట్స్ లో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం విగ్రహప్రతిష్టాపన జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు హాజరయ్యారు.. గత కొంత కాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఇద్దరు నేతలు మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పందించారు.
ఇలాంటి సందర్భాల్లో తన మర్యాదను అపార్థం చేసుకోవద్దని పవన్ కళ్యాణ్ కోరారు. ‘రాజకీయ విభేదాలను నేను సిద్ధాంతాల పరంగానే చూస్తా. వ్యక్తిగతంగా చూడను. ఇది కొరవడటం వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు అసెంబ్లీ సమావేశాలను సక్రమంగా నిర్వహించలేకపోయాయి' అని పవన్ వ్యాఖ్యానించారు.
నాయకులు ఎవరైనా కలిసినప్పుడు మంచిచెడ్డలను అడిగి తెలుసుకోవడం ఒక మర్యాద. నేను కలిసే లేదా శుభాకాంక్షలు తెలిసే నేతలందరికీ నేనెవరో తెలుసు. రాజకీయ ప్రయాణంలో భాగంగా పరిచయాలు ఏర్పడతాయి. తన మర్యాదను మరోలా అర్థం చేసుకోవద్దు' అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
Comments