Tollywood producer Aswani Dutt remembers Sridevi. He shares interesting incident of Sridevi with media.
సినీవినీలాకాశంలో మెరుపులు మెరిపించి శ్రీదేవి శాశ్వతంగా అభిమానులకు, కుటుంబసభ్యులకు దూరం అయ్యారు. బుధవారం అశ్రునయనాల మధ్య శ్రీదేవి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఎందరో స్టార్ హీరోలకు శ్రీదేవి లక్కీ హీరోయిన్. కేవలం హీరోలకు మాత్రమే కాదు దర్శక, నిర్మాతలకు సైతం శ్రీదేవి కల్పతరువుగా అప్పట్లో ఉండేది. తన పాత్రకు వంద శాతం న్యాయం చేకూర్చి సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించేది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కు శ్రీదేవి ప్రత్యేకం. ఆయన నిర్మాణంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆఖరి పోరాటం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో శ్రీదేవి నటించారు.
అశ్విని దత్ ముంబై వెళ్లి శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శ్రీదేవి గారు తన జీవితంలో చిరకాలం గుర్తుంది పోయే జ్ఞాపకం అని అశ్వినీదత్ అన్నారు.
అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా తాను శ్రీదేవి కుమార్తెల ముఖాలు చూడలేకపోయాని అన్నారు. తల్లి కోసం ఇద్దరు కుమార్తెలు తల్లడిల్లిపోయారని అశ్వినీదత్ ఆవేదన వ్యక్తం చేసారు. ఆమె కుటుంబం మొత్తం షాక్ లో ఉన్నారని అశ్వినీదత్ అన్నారు.
అశ్వినీదత్ మీడియాతో మాట్లాడుతూ శ్రీదేవి నటనని, ఆమె హీరోయిన్ గా ఉన్నప్పుడు ప్రదర్శించిన మంచి ప్రవర్తనని ఆయన కొనియాడారు. శ్రీదేవి వందశాతం ప్రొడ్యూసర్స్ హీరోయిన్ అని ఆశ్వినిదత్ అన్నారు.
శ్రీదేవి ప్రొడ్యూసర్స్ హీరోయిన్ అని చెప్పడానికి ఓ ఉదాహరణ వివరించారు. తిరుపతిలో గోవిందా గోవిందా చిత్ర షూటింగ్ జరుగుతోంది. తెల్లవారు జామున 4 గంటలకు శ్రీదేవి లోబిపితో పడిపోయారు. ఆమె పెదవి పగిలి రక్తం వస్తోంది. ఆ సమయంలో ఆమెని మద్రాసు ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తన్నాను.
కానీ శ్రీదేవి షూటింగ్ కు ఆటంకం కలగకూడదని భావించారు. తిరుపతిలోని లోకల్ హాస్పటల్ లో ట్రీట్ మెంట్ చేయించుకుని షూటింగ్ కు రెడీ అయిపోయారు. పగిలిన పెదవిని మేకప్ తో కవర్ చేసుకున్నారు అని అశ్వినీదత్ అన్నారు.
Comments