New film of Adivi Sesh, Shivani to be shot from February Lakshya Productions is all set to produce acclaimed actor Adivi Sesh's next movie. This will go on the floors sometime in February.
టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్, డాక్టర్ రాజశేఖర్ కుమార్తే శివాని తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. లక్ష్య ప్రొడక్షన్ బ్యానర్లో రూపొందే చిత్రం ద్వారా శివాని సినిమా పరిశ్రమలోకి అడుగుపెడుతున్నది. ఈ చిత్రంలో అడవి శేషు హీరోగా నటించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ జరుగనున్నది.
శివానీ, అడవి శేషు జంటగా నటిస్తున్న ఈ చిత్రం హిందీలో ఘన విజయం సాధించిన 2 స్టేట్స్ అనే చిత్రానికి రీమేక్. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు వెంకట్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎల్వీ సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తెలుగు నేటివిటికి దగ్గరగా ఉండేలా రూపొందించిన స్క్రిప్టు కారణంగా ఈ చిత్రంలో నటించడానికి శివానీ ముందుకు వచ్చినట్టు తెలిసింది. యువతను ఆకట్టుకొనే విధంగా రూపొందే ఈ చిత్రానికి అనూప్ రూబెన్ సంగీతం అందించనున్నారు. నటీనటులు వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.
క్షణం, బాహుబలి చిత్రాలతో ప్రేక్షకాదరణను కూడగట్టుకొన్న అడవి శేషు ప్రస్తుతం గూఢచారి అనే చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉండటం, రాజశేఖర్ కూతురు తొలి చిత్రం కావడమనే అంశాలు అడవి శేషును ఆకట్టుకున్నట్టు తెలిసింది. గతంలో తమిళ చిత్రం ద్వారా శివానీ సినీ రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ చివరకు తెలుగు పరిశ్రమ ద్వారానే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం గమనార్హం.
Comments