Andhra Pradesh Chief Minister Chandrababu Naidu, on Thursday, laid foundation stone of State Forensic Science Laboratory in Tulluru near Amaravati. The FSR will be spread across three acres of land with the estimated cost of Rs 250 Crore. The FSL was approved by the Union Cabinet under the umbrella scheme of 'Modernization of Police Forces'.
తనకు జరిగిన అవమానానికి డిప్యూటీ సిఎం రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. హోం మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న తనకే తన శాఖ నుంచి అవమానం ఎదురు కావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయినట్లు చెబుతున్నారు. పోలీసు శాఖకు సంబంధించిన ఫొరెన్సిక్ ల్యాబ్కు శంకుస్థాపన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందిన తీరుపై కినుక వహించి ఆ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయిన విషయం తెలిసిందే. దాంతో ఆయన రాజీనామాకు కూడా సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది.
తనకు జరిగిన అవమానానికి అలిగి, ఆ కార్యక్రమాన్ని బహిష్కరించడమే కాకుండా గౌరవం లేని పదవిలో ఎందుకు ఉండడమనే బాధతో రాజీనామా చేసే వరకు వెళ్లినట్లు సమాచారం. గురువారం తుళ్లూరులో జరిగిన ఫొరెన్సిక్ ల్యాబ్ కేంద్రానికి శంకుస్థాపనకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా వచ్చారు.
ఆ కార్యక్రమం ముందుగానే ఖరారైనప్పటికీ సంబంధిత హోం శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు ప్రభుత్వ శాఖ నుంచి లేదా డీజీపీ కార్యాలయం నుంచి కాకుండా ఒక సాధారణ కానిస్టేబుల్ ద్వారా పోలీసు శాఖ నుంచి ఆహ్వానం అందింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
Comments