సూపర్‌స్టార్లతో వరుసగా 12 సినిమాలు | Filmibeat Telugu
  • 6 years ago
Mythri Movie Makers Pvt. Ltd is an Indian film production company established by Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan Cherukuri (CVM).

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక సినిమాను తెరకెక్కించి రిలీజ్ చేయాలంటే తల ప్రాణం తోకకు వచ్చినంత పనవుతుంది. ఒకవేళ నానా కష్టాలు పడి సినిమా తీసినా రిలీజ్ చేయలేక ఆగిపోయిన సినిమాలు ఎన్నో. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 చిత్రాల నిర్మాణానికి సిద్ధమవుతున్నది మైత్రీ మూవీ మేకర్స్.
శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ విజయాల ఊపుతో దూసుకెళ్తున్న మైత్రీ మూవీస్ ఏకంగా 12 చిత్రాలకు పచ్చ జెండా ఊపారు.
ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ఓ విభిన్నమైన చిత్రం రంగస్థలం ను నిర్మిస్తున్నారు.
అదే ఊపులో చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సవ్యసాచి పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం విలక్షణ నటుడు మాధవన్‌ను రంగంలోకి దించారు.
ఇక అర్జున్ రెడ్డి చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకొన్న విజయ్ దేవరకొండతో మరో సినిమాను రూపొందించనున్నారు.
అజాతవాసి చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారు. త్రివిక్రమ్ సినిమా రిలీజైన తర్వాత పీఎస్‌పీకే26 పట్టాలెక్కే అవకాశం ఉంది.
Recommended