Skip to playerSkip to main content
  • 8 years ago
India is a rapidly developing economy with numerous developmental needs. A major component of India’s developmental plan is the upgradation of current rail networks as well as the development of new high speed rail corridors popularly known as bullet trains.


భారత దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. భారత దేశం తన అభివృద్ధి ప్రణాళికలో రైల్వే వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగా హైస్పీడ్ రైలు కారిడార్స్‌ను తీసుకు వస్తోంది. వీటినే బుల్లెట్ రైళ్లు అంటారు. ముంబై - అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టును ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ప్రజల భద్రత, వేగం, ఉన్నతమైన సేవల కోసం దీనిని అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ ప్రాజెక్టు భారత దేశాన్ని ఇంటర్నేషనల్ లీడర్‌గా నిలబెట్టేందుకు ఉపయోగపడుతుంది.
ఎప్పటికి అప్పుడు వచ్చే కొత్త టెక్నాలజీని తీసుకు రావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతిఘటన కనిపిస్తుంటుంది. కానీ చరిత్రను చూస్తే మాత్రం కొత్త టెక్నాలజీ, ముందుచూపు వల్ల దేశానికి ఎంతో మేలు జరిగినట్లుగా కనిపిస్తోంది. ఉదాహరణకు, 1968 రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును చాలామంది విమర్శించారు. రైల్వే బోర్డు చైర్మన్ కూడా దానిని వ్యతిరేకించారు. అలాంటివి భారత్‌ను వెనక్కి నెట్టుతాయి. కానీ ఇప్పుడు అదే రైలులో చాలామంది ప్రయాణిస్తున్నారు.

Category

🗞
News
Comments

Recommended