Skip to playerSkip to main content
  • 8 years ago
Music maestro Ilayaraja regaled a sea of humanity that descended on the Gachibowli Stadium to listen to the live band show on a pleasant Sunday night.

మ్యూజిక్ మ్యాస్ట్రో, లయరాజ ఇళయరాజా సంగీత విభావరిలో సినీ, సంగీత అభిమానులు ఆనందంలో మునిగి తేలారు. హంగేరి బృందం పాల్గొన్న ఈ కార్యక్రమం సుమారు నాలుగు గంటలపాటు చాలా ఆసక్తికరంగా సాగింది. 80, 90 దశకాలలో సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన పాటలను ఇళయరాజా ప్రజెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ గాయకులు మనో, చిత్ర, యువ గాయకుడు కార్తీక్, ఇతర గాయనీ గాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, మోహన్‌బాబు, డీ సురేష్ బాబు, మంచు లక్ష్మీ, తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఇంకా సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు హాజరయ్యారు.
అణిముత్యాల్లాంటి పాటలతో ఈ సంగీత విభావరిని ఇళయరాజా రక్తికట్టించారు. మ్యూజిక్ కన్సర్ట్‌లో ఆయా పాటలను సమకూర్చే సమయంలో జరిగిన చోటుచేసుకొన్న తెర వెనుక విషయాలను మధ్య మధ్యలో వినిపించారు.
చిరంజీవి దంపతులు పాటకు అనుగుణంగా తాళం వేస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు.
Comments

Recommended