Pantham Movie Creates Senasations In Collections
  • 6 years ago
మాస్ హీరో గోపిచంద్ బాక్సాఫీస్‌పై తన పంతం నెగ్గించుకొంటున్నారు. గోపిచంద్ కెరీర్‌లోనే రికార్డు కలెక్షన్లు సొంతం చేసుకోవడం ట్రేడ్, క్రిటిక్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సున్నితమైన రాజకీయ విమర్శనాస్త్రంతో చక్కటి సందేశాన్ని ఇచ్చిన పంతం చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆకర్షిస్తున్నది. గత నాలుగు రోజుల్లో రూ.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లను పంతం సొంతం చేసుకోవడం సంచలనంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు రోజుల్లో రూ. 10.5 కోట్ల గ్రాస్, రూ.6.77 కోట్ల షేర్‌ను ఈ చిత్రం సాధించింది. మెహ్రీన్ ఫిర్జాదా, సంపత్ రాజ్, ముఖేష్ రుషి, పృథ్వీ, శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, పవిత్ర లోకేష్, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రం వినోదంతోపాటు సామాజిక సందేశాన్ని అందించింది. తొలి చిత్ర దర్శకుడు కే చక్రవర్తి రూపొందించిన ఈ చిత్రం జూలై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
పంతం చిత్రం ఆంధ్ర, తెలంగాణలో మంచి కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.6 కోట్ల షేర్ సాధించింది. ప్రాంతాల వారీగా చూసుకొంటే నైజాంలో రూ.1.96 కోట్లు, సీడెడ్‌లో రూ.1.05 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.83 లక్షలు వసూలు చేసింది.

Hero Gopichand's Pantham movie is creating sensation at Box office. This movie fetch highest revenue in Gopichand's career. This movie collected Rs.10.5 crores gross (Net Rs.6.77 crores net) collections in last four days.
#Pantham
#Gopichand
Recommended